యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుతో(Snakebite) పదో తరగతి విద్యార్థి(Student) మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఉమేశ్ అనే విద్యార్థి ఇంట్లో నిద్రిస్తుండగా తెల్లవారు జామున పాము కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు భువనగిరిలోని హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఉమేష్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.