వికారాబాద్, జనవరి 13 : వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో వస్తూ అనంతగిరి ఘాట్ వద్ద అదుపు తప్పింది. బస్సు డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం బస్సు హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తుంది. ఇందులో 92 మంది ఉన్నారు.
బస్సు వికారాబాద్ అనంతగిరి ఘాట్ రోడ్డు వద్ద బ్రేకులు ఫెయిలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ రఫీ చాకచక్యంతో ప్రయాణికులను కాపాడేందుకు బస్సును రోడ్డు దింపి పొదల్లోకి తీసుకెళ్లి నిలిపాడు. మొత్తం 9 మందికి గాయాలయ్యాయి.