హైదరాబాద్ : లాక్ డౌన్ నేపథ్యంలో రేపటి నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంతరంగికంగా యథావిధిగా నిత్య కైంకర్యాలు కొనసాగుతాయన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు