తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 2: ఉభయ తెలుగు రాష్ర్టాలలో తెలుగు సాహిత్యంలో విశేష సేవలందిస్తున్న 44 మంది ప్రముఖులకు 2019 సంవత్సరానికి గాను కీర్తి పురస్కారాలను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శుక్రవారం ప్రకటించింది.
పురస్కారాలకు ఎంపికైన వారిలో పీవీ మనోహరరావు (ఆధ్యాత్మిక సాహిత్యం), బాలాంత్రపు వెంకటరమణ (ప్రాచీన సాహిత్యం), గన్ను కృష్ణమూర్తి (సృజనాత్మక సాహిత్యం), రామగిరి శివకుమార్ (కాల్పనిక సాహిత్యం), వీ రమాంజనీ కుమారి (అనువాద సాహిత్యం), గరిపల్లి అశోక్ (బాల సాహిత్యం), కవిరాజు (వచన కవిత), బీ రాములు (తెలుగు గేయం), డాక్టర్ నలవోలు నరసింహారెడ్డి (పద్యరచన), డాక్టర్ వజ్జల రంగాచార్య (పద్య రచన), కూతూరు రాంరెడ్డి (కథ), పీఎస్ నారాయణ (నవల), వైవీఎల్ఎన్ శాస్త్రి (హాస్యరచన), గిడుగు వెంకటకృష్ణారావు (జీవిత చరిత్ర), మల్లవరపు చిన్నయ్య (వివిధ ప్రక్రియలు), వడ్డేపల్లి నర్సింగరావు (నాటక రచయిత) ఉన్నారు.