Tribal Welfare | ఖమ్మం : తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థులకు తెలుగులో మార్కులు తక్కువగా రావడంతో ఉపాధ్యాయుడు లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ర, డస్టర్తో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు.
ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు గురుకులానికి వచ్చి ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా తెలుగు టీచర్ లక్ష్మణ్పై దాడి చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పి ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్కు తరలించారు.