Yendluri Sudhakar | ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. సుధాకర్ మృతిపట్ల రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్తో పాటు పలువురు కవులు, రచయితలు సంతాపం తెలిపారు.
కవి ఎండ్లూరి సుధాకర్ 1959, జనవరి 21వ తేదీన నిజామాబాద్ జిల్లాలోని పాములబస్తీలో జన్మించారు. తన ప్రాథమిక విద్య, ఉన్నత విద్య హైదరాబాద్లోనే కొనసాగింది. నల్లకుంట ఓరియంటల్ కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, ఎంఫిల్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
సాహిత్య లోకం నుంచి ‘కొత్త గబ్బిలం’ నిష్క్రమించినా ఆయన రచనలు ఎప్పటికీ ‘వర్తమానమే’. ‘వర్గీకరణీయ గోసంగి’ కవి ‘అటజనికాంచె’గా సాహిత్య వెలుగులు వెదజల్లుతూనే ఉంటారు. తెలుగు సాహిత్యానికి ఇష్టుడైన గొప్ప కవిని సాహిత్య రంగం కోల్పోయింది. కుల ఆధిపత్యాల మీద విరుచుకుపడ్డ ఆయన ‘పాదముద్రలు’ చెరిగిపోనివి. ఎండ్లూరి రచనలకు మరణం లేదు.
– జూలూరు గౌరీశంకర్, చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ.