వరంగల్ : మహా భాగవతం రచించిన మహాకవి బమ్మెర పోతన తెలుగు వారు గర్వించదగ్గ కవి అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సహజ కవి బమ్మెర పోతనామాత్యుడి జయంతి సందర్భంగా బుధవారం పోతనామాత్యుడికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పోతన జన్మించిన గ్రామం బమ్మెర నా నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టం అన్నారు.
అది కవి, తొలి తెలుగు విప్లవ కవి, ప్రజల భాషలో గ్రంథాలు రాసిన పాల్కురికి సోమనాథుడు, సహజ కవి, తన గ్రంథాలను రాజులకు అంకితం ఇవ్వడానికి ఒప్పుకొని ఆత్మ గౌరవ కవి బమ్మెర పోతనామాత్యుడు జన్మించిన, వాల్మీకి ఆశ్రమం, సీతా రాముల తనయులు లవకుశులు జన్మస్థానం వాల్మీకి పురం – వల్మీడి, పాలకుర్తి, బమ్మెర గ్రామాలను సీఎం కేసిఆర్ టూరిజం హబ్ చేయాలని నిర్ణయించారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు అభివృద్ధి పనులు కూడా చకచకా సాగుతున్నాయని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తున్నాం. పాలకుర్తి ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.