Gambhiraopet | గంభీరావుపేట, మే 27: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని కేజీ టు పీజీ విద్యాలయంలో చదువుకునేందుకు ఈ ప్రాంత విద్యార్థులే కాకుండా పొరుగు జిల్లాల వారు కూడా ఆసక్తి చూపుతున్నారు. శనివారం కామారెడ్డి జిల్లా రత్నగిరి పల్లెకు చెందిన 9వ తరగతికి చెందిన నలుగురు విద్యార్థుల తల్లులు పాఠశాల హెచ్ఎం గంగారాంను కలిశారు. ‘మాపిల్లలను మీ బడిలో చేర్చుకోండి సార్’ అని వేడుకున్నారు.
పాఠశాలలు ప్రారంభం కాకముందే ప్రైవేటు విద్యాసంస్థల మాదిరిగా కేజీ టు పీజీలో చేరాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరడం ప్రభుత్వం కల్పిస్తున్న వసతులకు నిదర్శనం. మంత్రి కేటీఆర్ సహకారంతో సకల వసతులతో కూడిన కేజీ టు పీజీ వరకు విద్యను ఒకే ప్రాంగణంలో అందిస్తుండటంతో పొరుగు జిల్లాల విద్యార్థులు గంభీరావుపేట క్యాంపస్లో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు.