హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): జాతీయ గీతాలాపనలో ప్రపంచ రికా ర్డు సృష్టించి దేశం గర్వించేలా చేసిన పండుగ అర్చనను స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. జనగణమన జాతీయ గీతాన్ని 75 సార్లు వరుసగా 7 గంటలపాటు ఆలపించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి అర్చన తన పేరు నమోదు చేసుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. ఆమె సాధించిన విజయాలను గుర్తించి ‘తారే జమీన్ పర్’ సంపాదకుడు రూపొందించిన ఫిబ్రవరి సంచికను శుక్రవారం మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. జనగణమన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రయత్నం చేసిన అర్చన యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.