హైదరాబాద్ : తెలంగాణ జల వనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఆర్ఈసీ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్) గుర్తింపు ఇచ్చింది. ఏ ప్లస్ కేటగిరి గుర్తింపును ఇచ్చినట్లు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ తెలిపింది. కార్పొరేషన్ పనితీరు, ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఈ గుర్తింపు ఇచ్చినట్లు ఆర్ఈసీ పేర్కొన్నది. కాళేశ్వరం కార్పొరేషన్కు రెండు రోజుల క్రితం ఏ కేటగిరి గుర్తింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.
కేంద్ర విద్యుత్తుశాఖ పరిధిలోని ‘రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్’ (ఆర్ఈసీ) ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్’కు ‘ఏ క్యాటగిరీ’ గ్రేడ్ ఇచ్చింది. ఆర్ఈసీ దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల పనితీరు, నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్రేడింగ్ ఇస్తుంటుంది. ఈ క్రమంలో ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన నిధులను వినియోగించిన తీరు, వాటితో ఏమైనా ఫలితాలు వచ్చాయా? రుణ వాయిదాలను సక్రమంగా కడుతున్నారా? గడువులోగా వాయిదాలు చెల్లిస్తున్నారా? ఆయా ప్రాజెక్టుల నిర్వహణపై ఆడిటింగ్ నిర్వహిస్తున్నారా? వంటి అంశాలను లోతుగా అధ్యయనంచేసి గ్రేడింగ్ ఇస్తుంది. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ ర్పాటుచేసిన ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్’ ను ఆర్ఈసీ ‘ఏ క్యాటగిరీ’లో చేర్చింది. ఈఆర్సీ ద్వా రా ఏ గ్రేడ్ సాధించిన దేశంలని పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుగా, ఈ క్యాటగిరీలో స్థానం సాధించిన అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం రికార్డు సృష్టించింది.