Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని వీఆర్ఏలను క్రమబద్దీకరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించడం పట్ల వీఆర్ఏల అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను వీఆర్ఏల ప్రతినిధులు కలిశారు. క్రమబద్దీకరణ నిర్ణయంపై కేసీఆర్కు వీఆర్ఏలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద వీఆర్ఏల అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ ఉద్యోగాల క్రమబద్దీకరణ విషయంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా క్రమబద్దీకరణ వార్త చెప్పడం సంతోషంగా ఉందన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రతి వీఆర్ఏ కుటుంబం కేసీఆర్కు రుణపడి ఉంటుంది. ఇవాళ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం మరిచిపోలేని విషయం అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుందని ప్రతినిధులు పేర్కొన్నారు.