హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం దేశంలో తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంచింది. ఒకనాటి గ్రామాలేనా ఇవి అనేంతగా మార్పులు తీసుకొచ్చింది ఈ కార్యక్రమం. గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు చిరునామాగా మారాయి. ఈ కార్యక్రమం తరువాత గ్రామాల్లో మౌలిక వసతులు వృద్ధి చెందాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణకు మొదటి స్థానం లభించడానికి పల్లెప్రగతే కారణమైంది. ఇప్పటివరకు పల్లెప్రగతి ద్వారా గ్రామాలకు రూ.13,528 కోట్ల నిధులు లభించాయి. వీటికి ఇతర శాఖల నిధులు కూడా తోడయ్యాయి.
ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ, వైకుంఠధామం, డంపింగ్ షెడ్, నర్సరీ, పల్లెప్రకృతివనం లాంటి సదుపాయాలు అందివచ్చాయి. సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు విద్యుత్తు వ్యవస్థ మరింత మెరుగైంది. రోజూ ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తుండటంతో పారిశుద్ధ్యం బాగుపడింది. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలతో పచ్చదనం వెల్లివిరిస్తున్నది. వీటన్నింటి కారణంగా కేంద్ర ప్రభుత్వం ఏ క్యాటగరీ కింద ఏ అవార్డును ప్రకటించినా తెలంగాణ పల్లెలు అగ్రస్థానంలో ఉంటున్నాయి.
తెలంగాణ పల్లెలు సాధించిన కొన్ని ఘనతలు