డిచ్పల్లి, జూన్ 16: తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా వెనక్కి తగ్గారు. రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ యాదగిరిని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులి చ్చారు. గతంలో రిజిస్ట్రార్ నియామకం విషయంలో పాలక మండలితో వీసీ తలపడిన సంగతి తెలిసిందే. పరిస్థితులు రోజురోజుకూ ప్రతికూలంగా మారుతుండటంతో చివరకు యాదగిరికి రిజిస్ట్రార్గా బాధ్యతలు అప్పగించారు. ఆర్డర్ కాపీ తీసుకున్న యాదగిరి టీయూ పాలకమండలి సభ్యులకు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ, విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్కు సమాచారమిచ్చారు.
ఈసీ సూచన మేరకు ఆయన రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేతనాలు అందక ఐదు రోజులుగా నిరసనలు చేస్తున్న నాన్టీచింగ్ సిబ్బం ది శనివారం నుంచి విధుల్లో చేరాలని, వారికి సోమవారం లోపు జీతాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వర్సిటీ పాలక మండలి సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని రూసా భవనంలో జరుగుతుందని యాదగిరి తెలిపారు.