Promotions | తెలంగాణ రాష్ట్రంలోని రవాణా శాఖలో ఖాళీగా ఉన్న డీటీసీ, జేటీసీ పదోన్నతులకు ప్రత్యేక ప్రధాన కార్యదదర్శి వికాస్ రాజ్ నేతృత్వంలోని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది . రంగారెడ్డి డీటీసీ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , మహబూబ్ నగర్ డీటీసీ శివ లింగయ్యలను జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లుగా, ఉప్పల్ ఆర్టీఓ వాణి , ఖమ్మం ఆర్టీఓ ఆఫ్రిన్, మెహదీపట్నం ఆర్టీఓ కిషన్, కొత్తగూడెం ఆర్టీవో సదానందం, నాగోల్ ఆర్టీవో రవీందర్ కుమార్, సూర్యా పేట ఆర్టీవో సురేష్ రెడ్డి లను డీటీసీలుగా పదోన్నతులు కల్పిస్తూ డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.