నాలుగు విభాగాలుగా రాష్ర్టాల విభజన
మొదటి విభాగంలో నిలిచిన తెలంగాణ
పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా
మరోసారి రాష్ర్టానికి దక్కిన గుర్తింపు
టీఎస్ఐపాస్తో తరలివస్తున్న కంపెనీలు
సీఎం కేసీఆర్, కేటీఆర్ కృషి ఫలితం
టాప్ ర్యాంకింగ్ గర్వకారణం
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ మరోసారి టాప్ ర్యాంకింగ్లో నిలవడం గర్వకారణం. డీపీఐఐటీ.. దేశంలోని ఆరు రాష్ర్టాలతోపాటు తెలంగాణకు టాప్ అచీవర్ రేటింగ్ ఇచ్చింది. కాకపోతే మా రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ మాత్రమే కాదు.. దానికంటే ముఖ్యంగా పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ఆఫర్ చేస్తున్నాం.
– మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మరోసారి సత్తా చాటింది. దేశంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉన్న రాష్ర్టాల్లో అగ్రభాగాన నిలిచింది. సులభతర వాణిజ్య విధానంలో కేంద్రం ప్రకటించిన గ్రేడింగ్లో తొలి వరుసలో నిలిచి, తన స్థానాన్ని పదిలపర్చుకొన్నది. పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రాంతమని అనేకమంది ప్రపంచస్థాయి పారిశ్రామిక, వ్యాపారవేత్తలు ప్రకటించగా, దాన్ని కొనసాగింపుగా కేంద్రం ప్రకటించిన సులభతర వాణిజ్య విధానం (ఈడీవోబీ) క్యాటగిరీలు అధికారికం చేశాయి. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈవోడీబీ గ్రేడింగ్లను ప్రకటించారు. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) నిర్దేశించిన 301 సంస్కరణల్లో 281 సంస్కరణలను తెలంగాణ పూర్తిచేయగా, మరో 20 సంస్కరణలు రాష్ర్టానికి సంబంధం లేవిని ఉన్నాయి. ఈవోడీబీలో గతంలో ర్యాంకులు ప్రకటించిన కేంద్రం.. ఇప్పుడు గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. 95 శాతం, అంత కంటే ఎక్కువ స్కోర్ సాధించిన రాష్ర్టాలను టాప్ అచీవర్స్గా, 90 నుంచి 95 శాతం స్కోరు సాధించిన రాష్ర్టాలను అచీవర్స్గా, 80 నుంచి 90 శాతం సాధించిన రాష్ర్టాలను ఫాస్ట్ మూవర్స్గా, 80 శాతం అంతకంటే తక్కువగా వచ్చిన రాష్ర్టాలను అస్పైర్స్గా ప్రకటించింది. ఈ క్యాటగిరీల్లో తెలంగాణ మొదటి గ్రేడ్ సాధించి, టాప్ అచీవర్గా నిలిచింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హర్యానా, పంజాబ్, కర్ణాటక, గుజరాత్ రాష్ర్టాలు మొదటి విభాగంలో ఉన్నాయి.
టీఎస్ఐపాస్ గొప్పదనమే ఇదంతా!
2015లో సంస్కరణల అమలులో 42.45% స్కోరును మాత్రమే సాధించి దేశంలో 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దూరదృష్టి, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పట్టుదలతో సులభతర వాణిజ్య విధానం-2016లో తెలంగాణకు దేశంలోనే నెంబర్వన్ ర్యాంకు లభించింది. ఆ తర్వాత కూడా టాప్ 3లో వరుసగా నిలుస్తూ వచ్చింది. తాజాగా ప్రకటించిన గ్రేడింగ్లో మొదటి గ్రేడ్లో నిలిచింది. కారణం.. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ఐపాస్). పరిశ్రమలు స్థాపించే యజమాన్యాలు దాదాపు 15కు పైగా శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్ టీఎస్ఐపాస్ను తీసుకొచ్చారు. ఇది ప్రపంచంలోని అనేకమంది పారిశ్రామికవేత్తల ప్రశంసలు అందుకొన్నది. 2015 అమల్లోకి వచ్చిన ఈ చట్టం వల్ల రాష్ర్టానికి భారీఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. కేవలం 15 రోజుల్లోనే భారీ పరిశ్రమలకు అనుమతులు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే అనుమతులు ఇస్తున్నారు. పరిశ్రమల పెట్టుబడులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భూముల కోసం 1.50 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్తు నీటి వసతిని ఏర్పాటు చేస్తున్నారు. మిషన్ భగీరథలో 10 శాతం నీటిని పరిశ్రమల అవసరాలకు కేటాయించారు. వీటన్నింటి ఫలితంగా రాష్ర్టానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు
2020 సంవత్సరానికి గాను 301 సంస్కరణలను కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. దీనిలో తెలంగాణ 94.86 శాతం స్కోర్ సాధించింది. మొత్తం 301 సంస్కరణలకు గాను 281 సంస్కరణలను పూర్తిచేయగా మరో 20 సంస్కరణలు రాష్ర్టానికి సంబంధం లేనివే. మిగతా అన్ని విభాగాల్లో సంస్కరణలను పూర్తి చేసింది. కన్స్ట్రక్షన్ పర్మిట్ ఎనేబులర్స్, యుటిలిటీ అనుమతులు, భూ సంస్కరణలు, భూ బదిలీ, ఆస్తి బదిలీ, భూ వినియోగంలో మార్పులు, ఇన్స్పెక్షన్ ఎనేబులర్స్, తూనికలు కొలతలు, అతిథ్య రంగం, పర్యాటక రంగం అంశాల్లో సంస్కరణలను 2020లో అమలు చేసింది. దీనిలో భాగంగా చట్టాలకు సవరణలు, జీవోలు, సర్క్యులర్లు జారీ చేసింది. లక్ష్యాల సాధనకు మంత్రి కేటీఆర్ తీవ్రంగా కృషి చేశారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. సంస్కరణలు వేగవంతంగా పూర్తి చేయటంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం చూపారు. శాఖల మధ్య సమన్వయం కోసం నోడల్ అధికారులను నియమించారు. ఫలితంగా ఈవోడీబీలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది.
సంస్కరణలు ఇలా.. కార్మిక శాఖలో..
కాలుష్య నియంత్రణ మండలిలో
వాణిజ్యపరమైన వివాదాలకు
భూ పరిపాలన