కోదాడ, ఫిబ్రవరి 22 : సీఎం కేసీఆర్ పాలనాదక్షతతో ఎనిమిదేండ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సుభిక్షంగా విరాజిల్లుతున్నదని, తెలంగాణ మాడల్ పాలన తమకూ కావాలని యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, నల్లమోతు భాస్కరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో పంటలకు సాగునీరు సమృద్ధిగా అందిస్తున్నందున దేశవ్యాప్తంగా రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని వివరించారు. శాంతిభద్రతల నియంత్రణలో రాష్ట్రం దేశంలో నంబర్వన్గా ఉందని, అం దుకే జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు హైదరాబాద్కు వస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఐటీ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందడంలో మంత్రి కేటీఆర్ కృషి ఎనలేనిదని ప్రశంసించారు.