హైదరాబాద్ : టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(TET) ఫైనల్ కీ విడుదలైంది. టెట్ కన్వీనర్ రాధారెడ్డి బుధవారం కీని విడుదల చేశారు. ప్రస్తుతం జూలై 1న టెట్ ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. వాస్తవానికి ఈ నెల 27న టెట్ ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఫలితాల విడుదల ఆలస్యం కానున్నట్లు టెట్ కన్వీనర్ ప్రకటించారు.
ఆ తర్వాత మరింత కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. అయితే, టెట్ ఫలితాలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టత ఇచ్చారు. జూలై 1న ఫలితాలు ప్రకటించిన విషయం విధితమే. జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించగా.. పేపర్-1కు 3,18,506 మంది అభ్యర్థులు, పేపర్-2కు 2,51,070 మంది హాజరయ్యారు. ఈ నెల 15న ప్రైమరీ కీ విడుదలవగా.. ప్రస్తుతం ఫైనల్ కీని అధికారులు విడుదల చేశారు.