తిరుమల శ్రీవారిని తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో జనార్ధన్ రెడ్డి.. స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.