హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : టీచర్లకు ఏకీకృత సర్వీస్ రూల్స్ను అమలుచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య తదితరులు కోరారు. మంగళవారం వారు కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, ధర్మేంద్రప్రదాన్, బండి సంజయ్కుమార్ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి, రెండు దశాబ్దాలుగా నిలిచిపోయిన ఉద్యోగోన్నతులను పూర్తిచేయాలని కోరా రు.ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని టీచర్లకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని, టెట్ నుంచి మినహాయించాలని, దూరవిద్య ద్వారా ఎంఈడీ పూర్తిచేసుకునే వెసులుబాటు కల్పించాలని వినతిపత్రాలు సమర్పించారు.