హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) 17వ సమావేశం ఈ నెల 10న జరుగనున్నది. జలసౌధలో జరిగే ఈ భేటీకి 21 అంశాలతో ఎజెండాను ఖరారు చేసినట్టు తెలంగాణ, ఏపీకి కేఆర్ఎంబీ లేఖలు రాసింది. సమావేశంలో చర్చించే ఎజెండా అంశాలను ప్రతిపాదించాల ని కేఆర్ఎంబీ ఇప్పటికే కోరడంతో రెండు రా ష్ర్టాలు తమ డిమాండ్లను బోర్డుకు నివేదించా యి. ట్రిబ్యునల్-1 అవార్డు ప్రకారం తాగునీటికి వినియోగించుకుంటున్న నీటిలో 20% మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, అవార్డును అమలు చేయాలన్న అంశంపై చర్చించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ఔట్లెట్లపై టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినా ఇప్పటికీ అమలు చేయలేదు. రెండ దశ టెలిమెట్రీల ఏర్పాటుపై చర్చించాలని తెలంగాణ సూచించింది. రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ఆధునీకరణతోపాటు ఏపీ చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ పనులను వెంటనే నిలిపివేయాలన్న అంశాన్ని కూడా ప్రతిపాదించిన తెలంగాణ.. బోర్డులో అదనపు మెంబర్ నియామకానికీ డిమాండ్ చేస్తున్నది.
ఏపీ సర్కార్ కోర్కెలు
శ్రీశైలంలో తెలంగాణ చేపడుతున్న విద్యు త్తు ఉత్పత్తి, రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ సిఫారసుల అమలుతోపాటు తెలంగాణ చేపట్టిన పలు ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. బోర్డు తన వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై, గత బడ్జెట్ ఆడిట్పై చర్చించనున్నది. బోర్డులో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు ప్రస్తుతం బేసిక్పై అధికంగా చెల్లిస్తున్న 25% ఇన్సెంటివ్స్ను రద్దు చేయడంతోపాటు ఇప్పటివరకు చెల్లించిన మొత్తాన్ని రికరీ చేయాలని కేంద్ర జల్శక్తి శాఖ ఇటీవల ఆదేశించినందున ఆ అంశంపైనా చర్చించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విశాఖకు తరలించడం, నీటి పంపకా లు, వినియోగం, రివర్ బోర్డుల గెజిట్ అమలు, తదితరాలను కలిపి మొత్తంగా 21 అంశాలను ఎజెండాలో పొందుపరచింది.