హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ఎన్నెన్నో ఆశలతో విదేశాల్లో చదువు, కొలువుల కోసం వెళ్తున్న మన యువత.. స్థానిక పరిస్థితులపై అవగాహన లేక ప్రమాదాలను కొని తెచ్చుకొంటున్నది. ఏమరుపాటు చివరకు ప్రాణాలు తీస్తున్నది. విదేశాల్లో ఉన్న బిడ్డల ఉన్నతిపై కలలుకంటూ స్వదేశంలో ఉంటున్న తల్లిదండ్రుల ఆశలు ఒక్కసారిగా ఆవిరి అవుతున్నాయి. విగతజీవిగా తిరిగి రావడాన్ని చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. రెండు రోజుల కిందట నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారానికి చెందిన క్రాంతికిరణ్రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వరంగల్లోని కరీమాబాద్కు చెందిన అఖిల్ జర్మనీలో ఓ నదిలో నీటమునిగి గల్లంతయ్యాడు.
ప్రాణాలు తీస్తున్న సరదా
రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువశాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మన దేశంతో పోలిస్తే, పాశ్చాత్య దేశాల్లో డ్రైవింగ్ పద్ధతులు భిన్నంగా ఉంటాయి. అక్కడ కుడివైపు వాహనాలను నడపాలి. కుడి చేత్తోనే గేర్లు వేయాల్సి ఉంటుంది. విశాలమైన రోడ్లు కావడంతో వాహనాల సగటు వేగం 100 నుంచి 120 కేఎంపీహెచ్ ఉంటుంది. రెప్పపాటులోనే పదుల సంఖ్యలో వాహనాలు ఓవర్టేక్ చేస్తుంటాయి. స్వదేశంలో వాహనాలు నడిపిన తీరుకు విరుద్ధంగా ఉన్న పద్ధతులకు పూర్తిగా అలవాటు పడకముందే సరదగా టూర్లకు వెళ్లి హైవేలపై మనవాళ్లు ప్రమాదాలకు గురవుతున్నారు. అన్నింటికి మించి డ్రైవింగ్ పొజిషన్లో మార్పులతో మార్జిన్లు అర్థం చేసుకోలేకపోవడం..స్నేహితులతో ట్రిప్ కోసం బయటికి వచ్చినప్పుడు జోష్లో అతి వేగంగా వాహనాలు నడపడం, హైఎండ్ లగ్జరీ కార్లు ఇలా..ప్రతిదీ ప్రమాదానికి కారణం అవుతున్నది. ప్రధానంగా రోడ్లు దాటే సమయాల్లో అవగాహన లేమి ప్రమాదాలకు కారణం అవుతున్నది.
తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు చెప్పాలి
ఇటీవలి ప్రమాద ఘటనలు