కురుక్షేత్ర, ఫిబ్రవరి 17: హర్యానాలోని కురుక్షేత్ర ఎన్ఐటీలో తెలంగాణకు చెందిన విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)లో మొదటి సంవత్సరం చదువుతున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరి గ్రామానికి చెందిన 19 ఏండ్ల అంగోత్ శివ సోమవారం క్యాంపస్లో ఉన్న తన హాస్టల్ రూమ్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని రూమ్మేట్లు ఇద్దరూ భోజనానికి వెళ్లిన సమయంలో శివ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రూమ్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించ లేదని పోలీసులు తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు థానేసర్ పోలీసులు చెప్పారు. అతని ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదని పేర్కొన్నారు. శివ తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడని, అయితే అతను తన మాతృభాషలో మాట్లాడటంతో తమకేమీ అర్థమయ్యేది కాదని అతని రూమ్మేట్లు చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు.