హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): మాడల్ స్కూళ్లను తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్లుగా మార్చి అభివృద్ధి చేయాలని ప్రోగ్రెసివ్ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ కోరారు. గురువారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు
మాడల్ స్కూల్ టీచర్లకు పదోన్నతులు, బదిలీలు చేయాలని కోరారు. కార్యక్రమం లో సలీం, స్వామి, అకేనేపల్లి శ్రీనివాస్, ఫరూఖ్ అహ్మద్, సురేష్ ఉన్నారు.