Minister KTR | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): వ్యవసాయం దండుగ అన్నచోటనే పండుగ అయ్యిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నెర్రెలు బారిన ఈ నేల దశాబ్దిలోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణం అయ్యిందంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతాంగానికి చేసిన పనులను ఆయన వెల్లడించారు. కరువు నేలగా అల్లాడిన తెలంగాణ.. ఇవ్వాళ దేశానికి బువ్వపెట్టే అన్నపూర్ణగా మారిందని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కిసాన్ సరార్ దేశంలో ఎకడాలేని విధంగా రైతన్నకు అందిస్తున్న వరాల వల్లనే ఈ అద్భుతం ఆవిష్కృతం అయ్యిందని తెలిపారు. 65 లక్షల మందికి రూ.66 వేల కోట్ల రైతుబంధు, ఒక్కో రైతుకు రూ.5 లక్షల చొప్పున 782 రైతు కుటుంబాలకు రూ.5,039 కోట్ల పరిహారం, 27 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్తు, ప్రాజెక్టుల పూర్తితో పుషలంగా సాగు నీరు అందిస్తూ అండగా నిలుస్తున్నదని తెలిపారు. 10,769 గ్రామాల్లో రైతుబంధు సమితులు, ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున 2,601 రైతువేదికలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.