హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డిపై సీఈవో వికాస్రాజ్కు మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ను అనుసరించకుండా ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో అఫిలియేషన్ కోసం శుక్రవారం నుంచి తనిఖీలు చేయడానికి షెడ్యూల్ జారీ చేశారని ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్టు కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారపు శ్రీకాంత్, నాయకులు తెలిపారు.
ఒక పార్టీకి చెందిన నాయకుల కాలేజీలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని, ఎన్నికల్లో వారికి లబ్ధి చేకూర్చేలా వీసీ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా యూనివర్సిటీలో ఇద్దరు డైరెక్టర్లను నియ మించారని, ఈ విషయంపై స్పందించాలని ఈసీని కోరినట్లు తెలిపారు.