Telangana | కీసలో కాసులుంటేనే మొకం తెలివి! మనిషికైనా, రాష్ర్టానికైనా, దేశానికైనా.. ఎవరికైనా ఇదే లెక్కాపత్రం! దేశంలో అతి తక్కువ వయసున్న రాష్ట్రం మనది.. భౌగోళికంగా తెలంగాణది 11వ స్థానం.. జనాభా పరంగా చూస్తే 12వ స్థానం… అయితేనేం, అనుకున్నడు మన సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆర్థిక రంగంపై దృష్టి పెట్టి ‘సిరిగల్ల రాష్ట్రంగా శిఖరాగ్రాన నిలబెట్టేందుకు తనదైన చిట్టాపద్దులు రచించారు. ఫలితంగా ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది తెలంగాణ.. అతిపెద్ద రాష్ర్టాలకు సైతం ఆర్థిక పాఠాలు బోధిస్తున్నది మన రాష్ట్రం. తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ స్థానం. రాష్ట్ర తలసరి ఆదాయం తొమ్మిదేండ్లలోనే 3 రెట్లు పెరిగింది. 156 శాతం వృద్ధిని సాధించి దేశానికి అందనంత ఎత్తుకు ఎదిగింది మన రాష్ట్రం. జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,45,115 ఎక్కువ. దేశంలోని అనేక రాష్ర్టాల్లోని తలసరి ఆదాయం దీనికంటే తక్కువే!
ఏ లక్ష్యంతోనైతే ప్రత్యేక రాష్ర్టాన్ని సాధిం చుకున్నామో ఆ దిశగా తెలంగాణ పరు గెడుతున్నది. తెలంగాణ ఉద్యమ నినాద మైన ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అన్నింటినీ కేవలం తొమ్మిదేండ్లలోనే సాకారం చేసుకున్నది. అందులో.. అత్యంత ప్రధానమైన అంశం నిధు లు. మిగతా రెండింటిని సాకారం చేసుకోవడంలో నిధుల పాత్రే ఎంతో కీలకం. అయితే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే! అందుకే.. కేసీఆర్ ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆర్థిక రంగంపై దృష్టి సారించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమిటి? రాబడి ఎంత? ఖర్చులేంటి? వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సంపదను సృష్టించి ప్రజలకు పంచి.. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేందుకు కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆర్థిక రంగంపై కేసీఆర్ మార్క్ తొలి ఏడాది నుంచే కనిపించడంతో అతి తక్కువ సమయంలో సుసంపన్న రాష్ట్రంగా అవతరిం చింది. దేశంలో అనేక పెద్ద రాష్ర్టాలను సైతం వెనక్కి నెట్టి అగ్రస్థానా నికి ఎగబాకింది. దశాబ్దాల చరిత్ర కలిగిన రాష్ర్టాలకు ఆర్థిక వృద్ధిలో పాఠాలు బోధించే స్థాయికి ఎదిగింది. ‘తెలంగాణోళ్లకు ఏమొస్తది? వాళ్లకసలు పరిపాలించడమే చేతకా దు’ అన్న నోళ్లతోనే ‘తెలంగాణను చూసి నేర్చు కోండి.. కేసీఆర్ ది గ్రేట్’ అనే స్థాయికి చేరింది.
తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే నంబ ర్ వన్ స్థాయికి ఎదిగింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014-15వ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,115. అంటే తొమ్మిదేం డ్లలో తలసరి ఆదాయంలో తెలంగాణ కనీవినీ ఎరుగని వృద్ధిని నమోదు చేసింది. అతి తక్కువ సమయంలోనే తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. 156 శాతం వృద్ధిని సాధించింది. కేవలం.. తొమ్మిదేండ్లలోనే తలసరి ఆదాయం రూ.1,93,011 పెరిగింది. దేశంలో అతి తక్కువ సమయంలో ఇంత భారీగా తలసరి వృద్ధి సాధిం చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. తలసరి వృద్ధిలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు ఎంతో మెరుగ్గా ఉన్నది. 2014-15లో దేశ తలసరి ఆదాయం రూ.86,647 ఉంటే 2022-23లో రూ.1,72,000 మాత్రమే. తలసరిలో జాతీయ వృద్ధి 13.7 శాతం ఉండగా, తెలంగాణ మాత్రం 15.1 శాతంతో గణనీయ మైన వృద్ధిరేటును నమోదు చేసిం ది. అంటే, దేశం కంటే 1.4 శాతం అధిక వృద్ధిని సాధిం చింది. దేశంతో పోల్చి నా, దేశంలోని అనేక రాష్ర్టాల తో పోల్చినా.. తెలంగాణ ఆర్థి కంగా ఎంతో ఎత్తుకు ఎదిగిం ది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకుం టూ.. ఏటికేడు బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తున్నది.
దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.89 శాతం. కానీ.. దేశ జీడీపీ (స్థూల దేశీయ ఉత్పత్తి)లో తెలంగాణ వాటా 4.7 శాతంగా ఉండడం విశేషం. దేశంలోని మిగతా రాష్ర్టాలు అక్కడి జనాభాతో పోలిస్తే ఎంతో తక్కువ శాతం జీడీపీ వాటాను కలిగి ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీ (స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి) రూ.4,51,580 కోట్లు. 2022-23లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.12,93,469 కోట్లు. అంటే.. తొమ్మిదేండ్లలోనే రాష్ట్ర జీఎస్డీపీ రూ.8,41,889 కోట్లు పెరిగింది. దేశంలోని మరే రాష్ట్రంలోనూ అతితక్కువ సమయంలో ఇంత భారీగా జీఎస్డీపీ వృద్ధి జరగలేదు.
ఒక దేశంగానీ.. రాష్ట్రంగానీ అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్ని గీటురాయిగా తీసుకుంటారు. తలసరి ఆదాయ వృద్ధిరేటు ఆ దేశ, రాష్ట్ర అభివృద్ధి ప్రగతికి సూచీగా నిలుస్తుంది. జీడీపీ (స్థూల దేశీయ ఉత్పత్తి)/జీఎస్డీపీ (స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి)ని వ్యవసాయం, తయారీ రంగం, విద్యుత్, గ్యాస్ పంపిణీ, గనుల తవ్వకం, అడవులు, చేపల వేట, హోటల్, నిర్మాణం, సమాచార సంబంధాలు, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, బీమా, వాణిజ్య సేవలు, సామాజిక రంగం, ప్రజాసేవలు తదితర రంగాల నుంచి సేకరిస్తారు. దేశం లేదా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందిందా? లేదా మందగమనంలోకి వెళ్తుందా? అని నిర్ణయించడంలో జీడీపీ/జీఎస్డీపీనే కీలకం. జీడీపీ వృద్ధి చెందుతుం దంటే ఆ దేశం లేదా రాష్ట్రం ఆర్థికం, సంక్షేమం, అభివృద్ధిలో పురోగమిస్తుందని అర్థం. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఏవైనా ఒక ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలన్నా? ఒక పరిశ్రమ లేదా కంపెనీని స్థాపించాలన్నా? ఆ దేశ లేదా రాష్ట్ర జీడీపీనే ప్రామాణికంగా తీసుకుంటాయి. అనతికాలంలోనే ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ తెలంగాణకు రావడంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిదే ప్రధాన పాత్ర.
దేశ ఆర్థిక రాజధాని ఉన్న మహారాష్ట్ర, దేశానికే రోల్మోడల్ అని బీజేపీ పదేపదే వల్లె వేస్తున్న గుజరాత్ కంటే తెలంగాణ జీఎస్టీ రాబడిలో కనీవినీ ఎరుగని వృద్ధిని సాధించింది. ఐదేండ్లలోనే జీఎస్టీ వసూళ్లలో 125 శాతం వృద్ధిరేటును నమోదు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాణిజ్య పన్నుల శాఖను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వయంగా పర్యవేక్షించారు. ఆయన మార్గదర్శనంలో ఎన్నో కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా అనేక సర్కిళ్లు ఏర్పాటు చేశారు. ప్రతిస్థాయిలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. మాన్యువల్ నోటీసులు, ప్రొసీడింగ్ల జారీని పూర్తిగా తొలగించారు. శాఖాపరమైన పరిశోధనలు, విశ్లేషణల కోసం ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో గొప్ప సంస్కరణలతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగు పడింది. వ్యాపారాలు అద్భుతంగా అభివృద్ధి చెందాయి. ఫలితంగా.. జీఎస్టీ రాబడి అనూహ్యంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రూ.28,786 కోట్ల జీఎస్టీ వసూలు అయ్యింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.51,870 కోట్ల జీఎస్టీ రాబడి వచ్చింది. అంటే.. ఐదేండ్లలో జీఎస్టీ ఆదాయం రూ.23,084 కోట్లు పెరిగింది. సీఎం కేసీఆర్ సారథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా మారింది. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ పనితీరును, గొప్ప సంస్కరణలను అధ్యయనం చేసేందుకు గుజరాత్, ఉత్తర్ప్రదేశ్తోపాటు అనేక రాష్ర్టాలు రాష్ట్రంలో పర్యటించాయి. ఇక్కడి విధానాలను ఆయా రాష్ర్టాల్లో అమలు చేస్తున్నాయి.
ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) ఎంతో ముఖ్యం. ఇంత ప్రాముఖ్యమున్న మూలధన వ్యయంలో, సంపద సృష్టిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచే మూలధన వ్యయంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీనివల్లే.. అనతికాలంలోనే తెలంగాణ తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదిగింది. తెలంగాణ ఏర్పడినప్పుడు… 2014-15వ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం రూ.8,097 కోట్లు. తొమ్మిదేండ్లలోనే అది రెట్టింపు స్థాయిని మించిపోయింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ మూలధన వ్యయం కింద ఖర్చు చేసింది రూ.18,007 కోట్లు. అంటే.. తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో మూలధన వ్యయం రూ.9,910 కోట్లు పెరిగింది. దేశంలోని మరే రాష్ట్రంలో అతితక్కువ సమయంలో ఇంత భారీ మొత్తంలో మూలధన వ్యయం కింద వెచ్చించలేదు.
ఆర్థిక వృద్ధిలో తెలంగాణ జెట్ వేగంతో దూసుకెళ్తున్నది. పెద్ద రాష్ర్టాలను వెనకి నెట్టి రికార్డులు సృష్టిస్తున్నది. రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ జీఎస్డీపీ స్థిరంగా పెరుగుతూనే ఉన్నది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీ రూ.4,51,580 కోట్లు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.12,93,469 కోట్లకు ఎగబాకింది. అంటే, తొమ్మిదేండ్లలోనే జీఎస్డీపీ మూడురెట్లు పెరిగింది. గణనీయంగా 186 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. తొమ్మిదేండ్లలో జీఎస్డీపీ రూ.8,41,889 పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ రూ.2,72,03,767 కోట్లు. అంటే, దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.7 శాతం. ఎన్నో పెద్ద రాష్ర్టాలతో పోలిస్తే.. జీడీపీలో తెలంగాణ వాటానే ఎక్కువ. చివరికి, కరోనా విపత్తు సమయంలోనూ జాతీయ సగటును మించి జీఎస్డీపీలో వృద్ధిని నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఒకవైపు కరోనా కాటేస్తున్నా, కేంద్రం ఏకాణా ఇవ్వకున్నా వెనుదిరిగి చూడలేదు. ఆ సమయంలో దేశ జీడీపీ -1.4 శాతానికి పడిపోగా, తెలంగాణ మాత్రం 1.2 వృద్ధిరేటును నమోదు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దేశ జీడీపీలో తెలంగాణ పెద్దన్న పాత్ర పోషిస్తున్నది.