హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అన్ని విభాగాల సమస్త సమాచారంతో రాష్ట్ర అర్థ గణాంక శాఖ ‘తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్-2021’ పేరిట ఓ పుస్తకాన్ని రూపొందించింది. దీన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఏడేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని కూడా ఈ పుస్తకంలో పొందుపర్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, అర్థగణాంకశాఖ డైరెక్టర్ జీ దయానంద్, రిమోట్ సెన్సింగ్ సెంటర్ అదనపు డీజీ శ్రీనివాస్రెడ్డి, అర్థగణాంకశాఖ జాయింట్ డైరెక్టర్ పీ సౌమ్య, అసిస్టెంట్ డైరెక్టర్లు ప్రసాద్రావు, రమణ, కన్సల్టెంట్ రాంభద్రం తదితరులు పాల్గొన్నారు.