వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 2: తెలంగాణ సోనా బియ్యంలో బోలెడు పోషకాలు ఉన్నాయని, అందుకే మంచి ఆదరణ పొందిందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్రావు అన్నారు. గురువారం అమ్యూస్ ఫుడ్ సంస్థతో ఒప్పందం సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్సిటీ శాస్త్రవేత్తల నిరంతర కృషితో తెలంగాణ సోనా రూపొందిందని, దానిలో రుచి, చక్కెర శాతం తక్కువగా ఉన్నందున వినియోగదారులు తక్కువ ధరలో మంచి పౌష్టికాహారం పొందుతున్నారని చెప్పారు. నాణ్యతతో కూడిన పౌష్ఠికాహారం అందించేందుకు అమ్యూస్ ఫుడ్ సంస్థ ముందుకు రావటం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో డైరెక్టర్ జగదీశ్వర్, అమ్యూస్ ఫుడ్ సంస్థ యజమాని వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.