హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 6,7,8 తరగతుల్లో, కరీంనగర్, గౌలిదొడ్డిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కాలేజీల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల మెరిట్ జాబితాను అధికారులు శనివారం విడుదల చేశారు. అర్హత సాధించిన విద్యార్థులు 17లోగా కేటాయించిన గురుకులాల్లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.