హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బుధవారం కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 2,319 కేసులు వెలుగు చూశాయి. మరోవైపు 474 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 18 వేలు దాటింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,275, మేడ్చల్ మల్కాజిగిరిలో 234, రంగారెడ్డిలో 173, సంగారెడ్డి 67, హనుమకొండలో 74 కేసులు వెలుగుచూశాయి.
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 2.46 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 73,916 మందికి మొదటిడోస్, 1.40 లక్షల మందికి రెండో డోస్, 36,691మందికి బూస్టర్ డోస్ వేశారు. 15-17 ఏండ్లవారికి ఇప్పటివరకు 45 శాతం మందికి మొదటి డోస్ పంపిణీ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20.83 లక్షల డోసులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్లో కలిపి 54,365 పడకలు అందుబాటులో ఉన్నాయి.