Farmers | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): దేశంలోని రైతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెన్నుపోటు పొడిచారని రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నల్ల చట్టాలను ఉపసంహరిస్తామని ప్రకటించి, రైతులకు క్షమాపణ చెప్పి.. ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు కనీస చర్య లు తీసుకోలేదని మండిపడ్డారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుబాంధవుడిగా మారారని, అనేక రైతుసంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నల్లచట్టాలు ఎత్తి వేయాలని, కనీ స మద్దతుధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ పలు రాష్ర్టాలకు చెందిన రైతుసంఘాల నాయకులు కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు యాత్ర చేపట్టారు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర ముఖ్యమంత్రులను కలిసి తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ‘కిసాన్ యాత్ర’ పేరుతో ఈ నెల 2న ప్రారంభమైన యాత్ర సోమవారం హైదరాబాద్కు చేరుకున్నది. ఈ సందర్భంగా రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డితో 20 మంది రైతునేతల బృందం సమావేశం అయ్యింది. నల్లచట్టాలను తొలిగిస్తామని చెప్పి మోసం చేసిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యాత్రను చేపట్టినట్టు వారు తెలిపారు. వారి ఉద్యమానికి రైతుబంధు తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రకటించారు.
తెలంగాణలోనే రైతు డిమాండ్ల అమలు
కిసాన్యాత్ర విజయవంతం కావాలని, రైతు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. అప్పటివరకు తాము సైతం పోరాటం చేస్తామని వెల్లడించారు. రైతులు డిమాండ్ చేస్తున్న అనేక అంశాలు ఇప్పటికే తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ డీజిల్ రేట్లను మాత్రం డబుల్ చేశారని విమర్శించారు. దీని వల్ల రైతులపై పెనుభారం పడుతున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో కిసాన్యాత్ర చీఫ్ కో ఆర్డినేటర్ పీఆర్ పాండియన్, సభ్యులు బల్దేవ్ సింగ్ సిరాహా, వీకేవీ దురైస్వామి, ఎంపీ రమణ్, ఎల్ పళనియప్పన్, సుధా ధర్మలింగం, వీకేఎస్కే స్నేహిత్కుమార్, శివకుమార్ కాకాజీ, జాన్ జోసెఫ్, రజ్వీందర్సింగ్, స్వామి ఇందర్జీ, చెల్లాదురై, సుబ్రమణియన్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ దార్శనికతకు అబ్బురపడ్డ రైతు నేతలు
తెలంగాణకు వచ్చిన కిసాన్ యాత్ర నేతలు సీఎం కేసీఆర్ దార్శనికత గురించి తెలుసుకొని అబ్బురపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను పల్లా రాజేశ్వర్ రెడ్డి వారికి వివరించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు పథకాలను విని నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశా రు. వీటిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్రం మొం డి పట్టుదల ఫలితంగా 700 మంది రైతులు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాల వేదనను సీఎం కేసీఆర్ ఒక్కరే మానవీయ కోణంలో అర్థం చేసుకున్నారని తెలిపారు. వారి రాష్ర్టాలకు వెళ్లి ఒక్కో రైతుకుటుంబానికి రూ.3 లక్షల చొప్పున సాయం చేసి భరో సా నింపారన్నారు. రైతులకు అండగా నిలిచినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
రైతులను మోసం చేస్తున్న మోదీ
మోదీ మళ్లీమళ్లీ రైతులను దగా చేస్తూనే ఉ న్నారు. మూడు చట్టాలను తొలగించడంతోపాటు, ఎమ్మెస్పీ చట్టం చేయాలనే డిమాండ్తో కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు రైతుయాత్ర చేస్తున్నాం. తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను గురించి తెలుసుకున్నాం. చాలా సంతోషంగా అనిపించింది.
– పీఆర్ పాండియన్, కిసాన్యాత్ర చీఫ్ కో ఆర్డినేటర్, తమిళనాడు
దేశానికే ఆదర్శంగా తెలంగాణ
తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉన్నారు. ఇక్కడి రైతు పథకాలు దేశానికే ఆదర్శం. ఇక్కడి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా రైతు చట్టాల విషయంలో పెద్దఎత్తున ఉద్యమం చేశాం. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చినట్టు నటించి మరోసారి మోసం చేసింది.
– బలదేవ్ సింగ్ సిరాషా, పంజాబ్ రైతు సంఘం నేత
ఎకరాకు రూ.10 వేలు గొప్ప సాయం
తెలంగాణలో రైతుబంధు పథకం అద్భుతంగా ఉన్నది. ఎకరాకు రూ.10 వేలు ఇవ్వడం గొప్ప విష యం. కేంద్రం రూ.6 వేలు ఇస్తున్నా, వాటిని మూ డు విడుతల్లో వేస్తున్నారు. అనేక నిబంధనలు అడ్డం గా ఉన్నాయి. కానీ తెలంగాణలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తున్నారు. ఊళ్లోనే ధాన్యం కాంటాలు పెట్టిన ఏకైక సీఎం కేసీఆర్. రైతు ఉద్యమంలో అమరులైన అన్నదాతల కుటుంబాలకు అండగా ఉన్నది సీఎం కేసీఆర్ ఒక్కరే. కిసాన్యాత్రలో 12 రాష్ర్టాల సీఎంలను కలువనున్నాం.
– సుధా ధర్మలింగం, మహిళ నేత, తమిళనాడు
నల్ల చట్టాలను తొలగించాలి
నల్లచట్టాలను తొలగించాలని వివిధ రైతుసంఘాల నాయకులు చేపట్టిన కిసాన్యాత్రకు మా సంఘం తరఫున స్వాగతం పలకడంతోపాటు సంపూర్ణ మద్దతు ప్రకటించాం. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కండ్లు తెరవాలి.
– కోటపాటి నరసింహ నాయుడు, సౌత్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
దేశానికే ఆదర్శంగా తెలంగాణ
తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉన్నారు. ఇక్కడ అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇక్కడి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
– బలదేవ్ సింగ్ సిరాషా, పంజాబ్ రైతు నేత
రైతుల డిమాండ్లు ఇవే..