హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): గల్ఫ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న తెలంగాణవాసులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల విజ్ఞప్తి చేశారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో అంతా క్షేమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. స్థానిక అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే గల్ఫ్ దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రతినిధులను వెంటనే సంప్రదించాలని కోరారు. గల్ఫ్లో ఉన్న ఎన్ఆర్ఐ ప్రతినిధులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.