హైదరాబాద్ : తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. రాష్ట్రంలో రోజువారీ కేసులు వెయ్యి దిగువకు దిగిరావడంతో ఊరటనిస్తున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 865 కొత్త కేసులు రికార్డయ్యాయి. వైరస్ బారినపడి ఒకరు మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 2,484 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,850 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇవాళ ఒకే రోజు 61,573 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీలో 263 కరోనా కేసులు నమోదయ్యాయి.