హైదరాబాద్ : తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 71,221 శాంపిల్స్ను పరీక్షించగా 4,693 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 33 మంది మృత్యువాతపడ్డారు. కాగా 6,876 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. నూతన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,16,404కు చేరుకుంది.