హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,559 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. మరో 1,961 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
గత 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1450 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 36,269 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1,13,670 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.