హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 4,416 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి 1,920 మంది బాధితులు కోలుకోగా.. మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,26,819కి చేరగా.. ఇందులో 6,93,623 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారితో 4,069 మంది మృత్యువాతపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 29,127 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో మరణాలు రేటు 0.56శాతం, రికవరీ రేటు 95.43శాతంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. ఇవాళ ఒకే రోజు 1,20,243 కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు వివరించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1670, మేడ్చల్ మల్కాజ్గిరిలో 417, రంగారెడ్డిలో 301, హనుమకొండలో 178, ఖమ్మంలో 117 కేసులు రికార్డయ్యాయని చెప్పింది.