హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 3,940 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. వైరస్ ప్రభావంతో తాజాగా ముగ్గురు మృతి చెందారు. కొత్తగా కొవిడ్ నుంచి 2398 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33,673 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే 97,113 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే 1,439 కేసులు రికార్డయ్యాయి.