హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 3,590 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. వైరస్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందగా, మరో 3,555 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,58,566కు చేరింది. ఇందులో 7,14,034 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40,447 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. వైరస్తో ఇప్పటి వరకు 4,085 మంది బాధితులు మృతి చెందారు. రికవరీ రేటు 94.13శాతం రికవరీ రేటు, 0.54శాతం మరణాల రేటు ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇవాళ ఒకే రోజు 95,355 టెస్టులు నిర్వహించినట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1160, మేడ్చల్ మల్కాజ్గిరిలో 257, రంగారెడ్డిలో 215 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించింది.