హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 2,646 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరో 3,603 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 34,665 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇవాళ 88,206 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 747 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.