హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 731 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మరణించినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ కరోనా నుంచి 993 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ర్టంలో ప్రస్తుతం 11,206 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 80, ఖమ్మంలో 64, నల్లగొండలో 56, కరీంనగర్, వరంగల్ అర్బన్లో 46 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) July 8, 2021
(Dated.08.07.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/rFc3egmb20