హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇటీవల రోజురోజుకు పెరుగుతూ వస్తున్న రోజువారీ కేసులు గురువారం భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,913 కొత్త కేసులు నమోదయ్యాయని రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మహమ్మారి బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. ఇవాళ 232 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,847 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,87,456కు చేరగా.. ఇందులో ఇప్పటి వరకు 6,75,573 మంది కోలుకున్నారు. కరోనా ఇప్పటి వరకు 4,036 మంది ప్రాణాలు వదిలారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.58శాతంగా ఉందని, రికవరీ రేటు 98.27శాతంగా ఉందని వివరించింది. ఇవాళ ఒకే రోజు 54,534 టెస్టులు నిర్వహించినట్లు చెప్పింది.