కార్పొరేషన్, ఏప్రిల్ 23: బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు ట్రస్మా (తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమానుల అసోసియేషన్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మంగళవారం కరీంనగర్లోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రస్మా ముఖ్య సలహాదారుడు ఈ విషయాన్ని వెల్లడించా రు.
ప్రైవేట్ టీచర్ల సమస్యలపై వినోద్కు సంపూర్ణ అవగాహన ఉన్నదని, పార్లమెంట్లో తమ సమస్యలను ప్రస్తావిస్తారనే ఉద్దేశంతో మద్దతు ఇస్తున్నామని చెప్పా రు. ఈ సమావేశంలో ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘం నాయకులు వేణుగౌడ్, రమేశ్, రవీందర్రెడ్డి, మధుసూదన్, రవి, రాజుయాదవ్, భరత్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.