హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : కేంద్ర యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు యువత రాజకీయాల్లోకి రావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర నిర్మాణ బాధ్యుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో యాదాద్రిలో నిర్వహించనున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల లోగోను ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు.
యువతకు శాశ్వత ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, వైద్యం తదితర అంశాలపై స్పష్టమైన హామీలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలిఉల్లాఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, బిజ్జా శ్రీనివాసులు, లింగం రవి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.