National Panchayat Awards | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డు పురస్కారాలను పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీ చైర్పర్సన్ అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఈ అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది. ఇటీవల కేంద్రం ప్రకటించిన 46 అవార్డులు ప్రకటించగా.. ఇందులో తొమ్మిది కేటగిరిలో తెలంగాణ 13 అవార్డు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రతి అంశంలోనూ అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు తెలంగాణ గెలుచుకోగా రాష్ట్రపతి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి తేనీటి విందు ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి మోరేశ్వర్ పాటిల్, కార్యదర్శి సునీల్ కుమార్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి దయాకర్రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా పంచాయతీకి నానాజీ దేశముఖ్ సర్వోత్తం పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం దక్కింది రూ.3కోట్ల నగదుతో పాటు పురస్కారం అందుకున్న ములుగు అధికార ప్రతినిధులు అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తం పంచాయతీ సతాత్ వికాస్ పురస్కార్ ఇటివల ములుగు జిల్లా జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా పురస్కారంతో పాటు రూ.3కోట్ల నగదు పారితోషకాన్ని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక సంస్థలతో కలిసి అందుకున్నారు.
కార్యక్రమంలో డీపీఓ వెంకయ్య, డీఎల్పీఓ దేవరాజ్ పాల్గొన్నారు.