హైదరాబాద్, జనవరి 14: సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్, సిస్టం) అమలులో తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు సీసీటీఎన్ఎస్తో అనుసంధానమై ఉంటూ.. కేసుల నమోదులో తెలంగాణ ఉత్తమంగా నిలిచినట్టు ఎన్సీఆర్బీ డిసెంబర్ నెల నివేదికలో వెల్లడించింది. సీసీటీఎన్ఎస్తో కేంద్ర దర్యాప్తు సంస్థలతోపాటు రాష్ట్రస్థాయిలోనూ పోలీస్ ఉన్నతాధికారులు ఆన్లైన్లోనే కేసుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సీసీటీఎన్ఎస్కు సంబంధించిన మౌలిక వసతులు, సాఫ్ట్వేర్, సిబ్బంది, డ్యాష్బోర్డు అమలు తదితర అంశాలలో తెలంగాణ పోలీస్శాఖ 97.9 శాతం స్కోరు సాధించింది. గుజరాత్ రాష్ట్రం 99.9 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, 96.7శాతంతో కర్ణాటక మూడో స్థానంలో, 94.8 శాతంతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉన్నట్టు ఎన్సీఆర్బీ వెల్లడించింది.