హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో 16,027 కానిస్టేబుల్ ఉద్యోగాలు కాగా, మిగతా 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. మే 2వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆన్లైన్ దరఖాస్తులతో పాటు తదితర వివరాల కోసం www.tslprb.in వెబ్సైట్ను సంప్రదించొచ్చు.
సీఎం కేసీఆర్ పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితిని మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 నుంచి 60 వేల మంది నిరుద్యోగులకు లాభం చేకూరే అవకాశం ఉంది.