Congress | నిజాంసాగర్, అక్టోబర్ 24: ‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పిన మాటలు విని గెలిపించాం. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేర్చలేదు. హామీలన్నీ బూటకమేనని తేలిపోయింది. కాంగ్రెస్ను నమ్మి మేము మోసపోయాం. మీరు మోసపోవద్దు’ అని కర్ణాటక రైతులు సూచించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ సరిహద్దుల్లో ఉండే కర్ణాటక రాష్ట్రం కరంజీ గ్రామానికి చెందిన రైతులు రాంరెడ్డి, సురేశ్ ఎక్లారా, విజయ్కుమార్ చిక్లి తదితరులు మంగళవారం జుక్కల్ మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని అన్నారు.
తెలంగాణలో మంచి పరిపాలన కొనసాగుతున్నదని కితాబిచ్చారు. కాంగ్రెస్ నాయకుల మాటలు విని ఆ పార్టీకి ఓటు వేశారో ఇక అంతేనని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలనే తెలంగాణలోనూ ఇస్తున్నారని, తమ రాష్ట్రంలో అమలు చేయనివారు తెలంగాణలో అమ లు చేస్తారా? ఆలోచించాలని కోరారు. తమను మోసగించిన కాంగ్రెస్ పార్టీని వచ్చే లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు.