హైదరాబాద్, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ) : ఉజ్వలచారిత్రక వారసత్వ సంపద తెలంగాణ సొంతమని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని యునెసో ఈ ఏడాది ‘డిసవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ (వైవిధ్యాన్ని ఆవిషరించండి, ఆస్వాదించండి)’ థీమ్తో నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా మంత్రి సురేఖ రాష్ట్రం లో వారసత్వ సంపద విశిష్టతలను, విశేషాలను, తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని వివరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. నాడు షోడశ (16) మహాజనపదాల్లో ఒకటిగా వెలుగొందిన అస్మక జనపదమే నేటి తెలంగాణ ప్రాంతం కావటం గర్వకారణమని పేర్కొన్నా రు. యునెసో గుర్తింపు పొందిన ఏకైక చారిత్రక కట్టడం రామప్ప ఆలయంలోని శిల్ప సంపద తెలంగాణలోని శిల్పుల కళానైపుణ్యా న్ని చాటి చెబుతాయని పేర్కొన్నారు. వేల ఏండ్ల నాటి పాండవుల గుట్ట రాక్ పెయింటింగ్స్, జైన బౌద్ధ ఆరామాలు, వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోట, పద్మాక్షి గుట్ట, భువనగిరి కోట,చార్మినార్,గోలొండ కోట,మకా మసీ దు, మెదక్ చర్చి, శిల్పాలు, చిత్రలేఖనాలు, శిలాశాసనాలన్నీ తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైవిధ్యాన్ని, వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయని మంత్రి వివరించారు.