జగిత్యాల టౌన్/జగిత్యాల రూరల్/అంతర్గాం, ఆగస్టు 7 : స్వరాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకుల్లో అనూహ్యమైన మా ర్పులు చోటుచేసుకొన్నాయని ఎస్సీ సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అ న్నారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని చేనేత సహకార సంఘంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్ అధ్యక్షతన జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి ప్రసంగించారు. ఉద్యమ కాలంలో ఆకలి చావులు కొనసాగుతున్న సమయంలో 2001-02 లో సిరిసిల్లలో సమావేశాన్ని ఏర్పాటు చేసి రూ. 50 లక్షల కార్పస్ ఫండ్ అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
రాష్ట్రంలో ఉన్న నేతన్నలకు చేనేత బీమా ప్రకటించి, నేత కార్మికుడు మరణిస్తే రూ. 5 లక్షలు ఇచ్చే పథకం దేశచరిత్రలో ఎక్క డా లేదన్నారు. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో అనేక విషయాలను గ్రహించి పరిష్కార మార్గాలను చూపుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సుంకె రవిశంకర్, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ గుగులోతు రవి తదితరులు పాల్గొన్నారు.