ధర్మపురి, మే 14: మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో ఓ నిరుపేద మహిళ సొంతింటి కల నెరవేరనున్నది. ఇంటి జాగ కొనేందుకు మంత్రి ఆర్థికసాయం చేయడంతోపాటు ఇల్లు కట్టించేందుకు ప్రభుత్వం తరఫున రూ.3 లక్షలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి అండగా నిలిచారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్కు చెందిన షేక్ రుక్సానా భర్త మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులు. కూలి చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నది. సొంతిల్లు లేకపోవడంతో గ్రామంలోనే అద్దెకు ఉంటున్నది. శనివారం దొంతాపూర్కు వచ్చిన మంత్రి కొప్పులను కలిసిన రుక్సానా తన దీనస్థితిని వివరించింది. స్పందించిన మంత్రి గ్రామంలో ప్రభుత్వ భూమి కేటాయించాలని ఆదేశించగా.. ప్రభు త్వ భూమి లేదని అధికారులు తెలిపారు. దీంతో ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి ఇవ్వాలని సర్పంచ్, ఎంపీటీసీకు సూచించారు. తనవంతుగా రూ.50 వేల సాయం ప్రకటించారు. ఇతర ప్రజాప్రతినిధులు రూ.67 వేలు జమచేయగా, మొత్తం రూ.1.17లక్షలను ఆమెకు అం దజేశారు. ఈ సందర్భంగా రుక్సానా, ఆమె కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.